Site icon HashtagU Telugu

AP Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ స‌మావేశం.. ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై ఆమోద ముద్ర‌

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరును ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీఓలో చేసిన మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మ ఒడి పథకానికి నిధులు విడుదల చేయడంతోపాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం కల్పించేందుకు అవసరమైన చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో అమలు చేయనున్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న వాహనమిత్ర అనే నాలుగు సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వంశధార నిరాశ్రయులకు రూ.216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రూ.15,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది మరియు వైద్య రంగంలో భారీ ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో 3,530 ఉద్యోగాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Exit mobile version