AP BJP : నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను తనిఖీ చేసిన పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో పర్యటించారు.

Published By: HashtagU Telugu Desk
Purandhareswari

Purandhareswari

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తూ, పురంధేశ్వరి నరసాపురంలో స్థానిక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. తన పర్యటనలో ఈ దుకాణాలలో మద్యం అమ్మకాల గురించి ఆమె ఆరా తీశారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం సేవించి అస్వస్థతకు గురైన వ్యక్తులతో కూడా సమావేశమయ్యారు. కల్తీ మద్యం సేవించకుండా చూడాలని పురంధేశ్వరి మద్యం బాటిళ్లను పగలగొట్టారు. రాష్ట్రంలో మ‌ద్యం తాగి అనేక మంది మ‌ర‌ణిస్తున్నార‌ని.. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. మద్యం బాండ్ల ద్వారా ప్రభుత్వం అప్పులు చేసిందని పురంధేశ్వరి విమర్శించారు. మద్యం వ్యవహారంపై గత నాలుగు రోజులుగా ప్రభుత్వంపై పురంధేశ్వ‌రి ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మ‌ద్య నిషేధం చేస్తామ‌న్న ప్రభుత్వం త‌న హ‌మీని నిల‌బెట్టుకోవాల‌ని సూచించారు.

  Last Updated: 21 Sep 2023, 10:51 PM IST