చిరస్థాయిగా గౌతమ్ పేరు నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి “మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ”గా పేరు పెడతామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు జిల్లా వ్యాప్తంగా శాశ్వతంగా నిలిచపోయేలా బ్యారేజీకి పేరు పెడతామని శాసనసభలో ఆయన స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును ఉదయగిరి ప్రాంతానికి రెండు దశలు కాకుండా ఒకే దశలో పూర్తి చేయాలని, దాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో వసతులను మెరుగుపరిచేందుకు రెండో దశ ‘నాడు నేడు’ పనుల ద్వారా వేగంగా పూర్తి చేస్తామని, అగ్రికల్చర్ యూనివర్శిటీగా మారుస్తామని అన్నారు. మంచివాడైన మంత్రి గౌతమ్ పైలోకంలో కూడా సంతోషంగా ఉండాలని, మేకపాటి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది అని ఏపీ సీఎం జగన్ రెడ్డి పేర్కొన్నారు.
Sangam Barriage to be completed soon .
We will name it as Mekapati Gautam Sangam Barriage- CM YS Jagan
#APAssembly pic.twitter.com/f0QQJeXFnv— Jagan Again (@AgainJagan) March 8, 2022