AP Weather : ఆంధ్రప్రదేశ్ను తుఫానుల వీడన్నంటున్నాయి. గత కొన్నాళ్లుగా వరుస తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏపీని భారీ వర్షాలతో విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో, 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Garlic : వెల్లుల్లి జుట్టును సంరక్షించగలదా? ఇక్కడ చిట్కాలు ఉన్నాయి
గత వారం కూడా, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినవి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలి వంటి ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పోర్లాయి. ఇదే కాకుండా, గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించింది. రైతుల ఆందోళన: తాజా తుఫాన్ హెచ్చరికలతో, పంటల చేతికొచ్చే దశలో ఉన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పంట నష్టం చుట్టమేమో అన్న భయంతో, రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
తెలంగాణలో చలి: ఇతర విషయానికి వస్తే, తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. హైదరాబాద్ – సికింద్రాబాద్ ప్రాంతాల్లో చలి వాతావరణం తీవ్రంగా పెరిగింది. నగర శివారులో రెండు, మూడు రోజులుగా కోల్డ్ వేవ్స్ ప్రభావం పెరిగింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే వారం రోజుల పాటు చలి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Karimganj : అస్సాం ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఓ జిల్లా పేరు మార్పు