Hyderabad : హైద‌రాబాద్‌లో భారీగా న‌గ‌దు ప‌ట్టివేత‌.. ఇద్ద‌ర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్‌ గుట్టును రట్టు చేశారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికలకు కొన్ని గంటల ముందు...

  • Written By:
  • Updated On - November 2, 2022 / 10:18 PM IST

హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్‌ గుట్టును రట్టు చేశారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికలకు కొన్ని గంటల ముందు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో హవాలా రాకెట్‌ను ఛేదించి రూ.1.27 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై లెక్కల్లో చూపని నగదును తరలించేందుకు యత్నిస్తున్న ఇద్దరు హవాలా ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిమాయత్ నగర్‌లో ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా ఫణికుమార్‌రాజు నుంచి రూ.1.27 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. పోలీసులు అత‌న్ని విచారించి, అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా ఇద్దరు నిందితులు అంబర్‌పేట నివాసి మన్నె శ్రీనివాస్ అకా శ్రీను, ఉస్మాన్‌గంజ్‌కి చెందిన సి విశ్వనాథ్ చెట్టిని అరెస్టు చేశారు. తాను మన్నె శ్రీనివాస్‌ కింద కలెక్షన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. పట్టుబడిన నగదుతో పాటు నిందితుల్ని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు.