ED Raids: జేసీపై ‘ఈడీ’ దాడులు!

తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు.

  • Written By:
  • Publish Date - June 17, 2022 / 12:19 PM IST

తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించి ఫోర్జరీ పత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టారు. జేసీ ట్రావెల్స్‌పై స్క్రాప్‌ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్‌వాయిస్‌లతో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వందకుపైగా వాహనాలు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, JC ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వగోపాల్ రెడ్డి ఇంటిపై దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 20 మంది సిబ్బంది తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోని జేసీ సోదరుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు.