Ambani Family : గొప్ప మనసు చాటుకున్న ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

ఈ సామూహిక వివాహానికి ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్, శ్లోక, ఈషా, ఆనంద్ హాజరయ్యారు.

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 08:32 PM IST

పేదలకు ముఖేష్ అంబానీ(Ambani Family) దంపతులు ఘనంగా సామూహిక వివాహాలు జరిపించి తమ గొప్ప మనసు చాటుకున్నారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో ఈ పెళ్లి వేడుకలు జరిపారు. ఈ సామూహిక వివాహానికి ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్, శ్లోక, ఈషా, ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జంటలకు కానుకలు విలువైన కానుకలు అందించారు.

బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కు పుడకలు, మట్టెలు, పట్టీలు వంటివి అందించింది. అలాగే పెళ్లి కూతురికి స్త్రీ ధనం కింద రూ.1.01 లక్షల చెక్ అందించింది. వీటితో పాటు ఆ జంటలకు ఏడాదికి సరిపడా నిత్యావసర సరుకులు సైతం అందించడం గమనార్హం. పుట్టింటి వారు తన కూతురికి పెళ్లి సారె అందించినట్లుగానే గ్యాస్ స్టవ్, మిక్సీ, పరుపులు, దిండ్లు, ఫ్యాన్, వంట సామగ్రి వంటివి అందించారు. ఇక ఈ పెళ్లి వేడుకకు దాదాపు 800 మందికి పైగా హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇలాంటి వందలాది పెళ్లిళ్లకు తమ మద్దతును కొనసాగిస్తామని అంబానీ కుటుంబం ప్రతిజ్ఞ చేసింది. అంబానీ కుటుంబం ఈ సామూహిక వివాహాల ద్వారా సార్వత్రిక నైతిక విలువల నినాదమైన “మానవ్ సేవా హి మాధవ్ సేవ” – “మానవత్వానికి చేసే సేవే భగవంతుని సేవ”ను సమర్థిస్తుంది.అందులో భాగంగానే ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇక ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి (Anant Ambani-Radhika Merchant wedding) జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వెడ్డింగ్ కు సంబదించిన శుభలేఖ వైరల్ గా మారింది.

Read Also : UP Hathras Stampede : 107కు చేరిన మృతుల సంఖ్య