Site icon HashtagU Telugu

Covid : కోవిడ్ బాధితుల‌కు ప‌రిహారం చెల్లించాల్సిందే.. అల‌హాబాద్ హైకోర్టు ఆదేశం

Allahabad High Court Imresizer

Allahabad High Court Imresizer

కోవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స సమయంలో మరణిస్తే వారికి ప‌రిహారం అందించాల్సిందేన‌ని అల‌హాబాద్ హైకోర్టు తెలిపింది. కోవిడ్ వ‌చ్చిన వారు గుండెపోటు లేదా మరేదైనా అవయవం పనిచేయకపోయినప్పటికీ, దానిని కోవిడ్ మరణంగా పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. అటువంటి మరణించిన వ్యక్తిపై ఆధారపడిన వారు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన పరిహారం లేదా ఎక్స్‌గ్రేషియా చెల్లింపుకు అర్హులు అని కోర్టు పేర్కొంది. కుసుమ్ లతా యాదవ్, పలువురు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను అనుమతిస్తూ జస్టిస్ అట్టౌ రెహమాన్ మసూది, జస్టిస్ విక్రమ్ డి చౌహాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కోవిడ్ బాధితులపై ఆధారపడిన వారికి ఒక నెల వ్యవధిలో ఎక్స్‌గ్రేషియా చెల్లింపును విడుదల చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది.