Bihar News: కళ్ళముందే కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన..వైరల్ వీడియో

నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తంగంజ్ వంతెన మూడు పిల్లర్లు కూలిపోవడంతో వంతెన భాగం సుమారు 100 మీటర్ల మేర కూలిపోయింది

Published By: HashtagU Telugu Desk
Bihar News

04 06 2023 Pull 23432258

Bihar News: నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తంగంజ్ వంతెన మూడు పిల్లర్లు కూలిపోవడంతో వంతెన భాగం సుమారు 100 మీటర్ల మేర కూలిపోయింది. సుల్తాన్‌గంజ్ అగువానీ వంతెన ఘటనలో గార్డు తప్పిపోయినట్లు సమాచారం. అంతకుముందు ఏప్రిల్ 29, 2022 రాత్రి నిర్మాణంలో ఉన్న వంతెన 36 స్పాన్లు కూలిపోయాయి. ఆదివారం కావడంతో పనులు మూతపడ్డాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ వంతెన నాణ్యతపై గతంలో అసెంబ్లీలోనూ ప్రశ్నలు సంధించినట్లు పరబత్త ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. అగువానీ-సుల్తాన్‌గంజ్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కలల ప్రాజెక్టు కాగా, నిర్మాణ సంస్థ ఎస్పీ సింగ్లా ఇక్కడ నాణ్యమైన పనులు జరపట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పర్బత్తా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎస్పీ సింగ్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ అలోక్ ఝాపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.

Read More: IRCTC: బంపర్ ఆఫర్.. నెలకు రూ.80 వేలు సంపాదించే సువర్ణ అవకాశం.. ఎలా అంటే?

  Last Updated: 04 Jun 2023, 07:56 PM IST