CM KCR: రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొని

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 10:43 AM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొని రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్‌ల బంధువులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వరంగల్‌కు చెందిన రాకేష్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రాకేష్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో అర్హులైన సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్లే రాకేష్‌ బాధితుడన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.