న్యూఢిల్లీ: అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ నిరసన నేపథ్యంలో ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలనుకునే పెద్ద సంఖ్యలో ప్రజలు శనివారం రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయారు. రైళ్ల కోసం చాలా సేపు నిరీక్షిస్తూ ఎక్కడ పడితే అక్కడ ప్రజలు కూర్చోవడం కనిపించింది. చాలా మంది ప్లాట్ఫారమ్పై కూర్చున్నారు, చాలా మందికి టిక్కెట్ కౌంటర్ల పక్కన స్థలం దొరికింది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన కారణంగా శనివారం 369 రైళ్లు రద్దు చేశారు. ఇందులో 210 ఎక్స్ప్రెస్ రైళ్లు, 159 లోకల్ ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
భారతీయ యువత సాయుధ బలగాల్లో సేవలందించేందుకు ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ స్కీమ్కు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఎంపికైన యువతను ‘అగ్నివీర్లు’ అంటారు. వీరిలో దాదాపు 46 వేల మందిని ఈ ఏడాది నియమించనున్నారు. రైల్వే పోలీస్ ఫోర్స్ కూడా రైళ్ల సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించకుండా సంఘ వ్యతిరేక శక్తులను దూరంగా ఉంచడానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.