హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హింసకు పాల్పడిన అగ్నిపథ్ పథకం ఆందోళనకారులు బీహార్, హర్యానాలో జరిగిన హింసాత్మక సంఘటనల నుండి ప్రేరణ పొందారని రైల్వే పోలీసు ఫోర్స్ పేర్కొంది.
ఆందోళనకారులు సైన్యంలోకి రిక్రూట్మెంట్ కోసం ఫిజికల్ టెస్ట్కు ఎంపికయ్యారని.. రాత పరీక్షకు సిద్ధమవుతున్నారని ఆర్పీఎఫ్ తెలిపింది. ఆందోళనకారులు సోషల్ మీడియా గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు. గ్రూప్ లో అగ్నిపథ్ పథకం వల్ల సైన్యంలో సేవ చేసే అవకాశం కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్, హర్యానా రైల్వే స్టేషన్లలో జరిగిన ఇలాంటి హింసాత్మక సంఘటనల నుండి నిరసనకారులు ప్రేరేపించబడ్డారని తెలిపింది. జూన్ 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు నిరసనకు రావాలని ఆందోళనకారుల మొబైల్ ఫోన్లలో కొన్ని సందేశాలను ఆర్పిఎఫ్ గుర్తించినట్లు సమాచారం.