Srivari Brahmotsavam: రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కరోనా ప్రభావంతో తిరుమల తిరుపతిలో ముఖ్యమైన పూజ కార్యక్రమాలు నిలిచిపోయాయి.

  • Written By:
  • Updated On - September 2, 2022 / 08:01 PM IST

కరోనా ప్రభావంతో తిరుమల తిరుపతిలో ముఖ్యమైన పూజ కార్యక్రమాలు నిలిచిపోయాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ కఠిన నియమాలు పాటించింది. అంగరంగ వైభవంగా జరుగాల్సిన ప్రత్యేక పూజలు మొక్కుబడిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత భ‌క్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలుకానున్నాయి.

సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5 వ‌ర‌కు మాడ వీధుల్లో వేడుకలు ఘనంగా జరగునునాయి. సెప్టెంబరు 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ కార్యక్రమాలు విధిగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.