ఏపీలో కొత్త మంత్రివర్గ జాబితా ఫైనల్ అయిన తరువాత ఒక పేరును మార్చారు. అనంతపురం నుంచి తిప్పేస్వామి పేరు ప్రకటించిన తరువాత ప్రకాశం జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో ఆ జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ పేరు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన తిప్పేస్వామి పేరును జాబితా నుంచి తొలగించారు. దీంతో ఆదిమూలపు సురేష్కు మరోసారి అవకాశం దక్కింది. తొలుత ఆదిమూలపు సురేష్ బెర్త్ అలాగే ఉంటుందని ప్రచారం సాగిన జిల్లాలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్రెడ్డిని తొలిగించడంతో ..సురేష్ని కూడా తొలిగించాల్సిన వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ ఆయనకు కెబినేట్లో బెర్త్ దక్కడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.