హీరో, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
తాను కరోనా బారిన పడ్డానని, అయినా కూడా తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. గడచిన రెండు రోజుల్లో తనను కలిసిన వారందరూ ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.