Mega Event: ‘అన్న కోసం తమ్ముడు’.. ఆచార్య ప్రిరిలీజ్ కు పవన్!

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’.

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 02:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు.

అయితే మొదట్లో ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్మోరెడ్డిని ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని తేలింది. తాజా సమాచారం ఏంటంటే.. ప్రిరిలీజ్ వేడుకకు జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర టీం అధికారికంగా ప్రకటించింది. ఇదే కనుక నిజమైతే ఒకే వేదికపై ముగ్గురు మెగా హీరోల సందడి నెలకొనబోతోంది. ఇప్పుడు ఈ వార్త మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. కాగా ఈ ప్రిరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు తెలంగాణ పోలీసులు కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది!