వరంగల్ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు నగరంలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన చింత అనిల్కుమార్గా పోలీసులు గుర్తించారు. మృతుడు తన స్నేహితుడిని బస్ ఎక్కించేందుకు బస్ స్టేషన్కు రాగా..ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తన స్నేహితుడు బస్సు ఎక్కిన తర్వాత తిరిగి వస్తుండగా, డ్రైవర్ రివర్స్ చేస్తుండగా ఓ బస్సు అతడిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. బస్సు వెనుక చక్రాల కింద యువకుడు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు, బంధువులు బస్ స్టేషన్కు చేరుకుని నాలుగు బస్సులపై రాళ్లు రువ్వారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బస్ స్టేషన్కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.