Kadapa: కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం!

  • Written By:
  • Publish Date - January 24, 2022 / 11:18 AM IST

కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు. సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో వెలుగుచూసిన ఈ భూగర్భ జలాశయాన్ని 1890లో బ్రిటీష్‌ వారు నిర్మించినట్లు అక్కడ శిలాఫలకం ఉంది. తాగునీటి అవసరాల కోసం ఇక్కడ నీటిని నిల్వ చేసుకునేవారని, అవసరమైనప్పుడు గ్రావిటీ ద్వారా కడపకు తీసుకెళ్లేవారని నిపుణులు చెబుతున్నారు.