Site icon HashtagU Telugu

Bengal Polls Violence : “పంచాయతీ” పోల్స్ రక్తసిక్తం.. తొమ్మిది మంది మృతి

Bengal Polls Violence

Bengal Polls Violence

Bengal Polls Violence : పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వేళ శనివారం హింసాగ్ని చెలరేగింది.  

పోలింగ్ జరుగుతుండగా పలుచోట్ల రాజకీయ వర్గాల మధ్య జరిగిన గొడవల్లో దాదాపు తొమ్మిది మంది మృతిచెందారు.

మరణించిన వారిలో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లకు చెందిన చెరో కార్యకర్త, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు ఉన్నారని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. 

కనీసం రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ బాక్సులు ధ్వంసమయ్యాయని(Bengal Polls Violence) తెలిపింది. 

Also read : DRDO Scientist Vs Pak Spy : మిస్సైల్స్ సీక్రెట్స్ లీక్.. పాక్ మహిళా ఏజెంట్ కు చెప్పేసిన సైంటిస్ట్