Trains Cancelled: అగ్నిపథ్ ఎఫెక్ట్.. 72 రైళ్లు రద్దు!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రైల్వే అధికారులు 72 రైళ్లను రద్దు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Secundrabad 1

Secundrabad 1

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రైల్వే అధికారులు 72 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే (SCR) కూడా 12 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. మూడు రైళ్లను దారి మళ్లించింది. కేంద్ర ప్రభుత్వ కొత్త ఆర్మీ రిక్రూట్‌మెంట్ పాలసీ “అగ్నిపథ్”కు వ్యతిరేకంగా వందలాది మంది యువత హింసాత్మకంగా నిరసన వ్యక్తం చేయడంతో సికింద్రాబాద్ నుండి బయలుదేరే రైళ్లు లేదా స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లు రద్దు చేయబడ్డాయి. ప్రజల భద్రత కోసం రైలు సేవలను నిలిపివేసినట్లు SCR అధికారి తెలిపారు. రైళ్ల రద్దు, కొన్ని రైళ్ల నిర్వహణపై నెలకొన్న గందరగోళం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రద్దు చేసిన రైళ్లలో హైదరాబాద్-షాలిమార్, ఉమ్దానగర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉమ్దానగర్, సికింద్రాబాద్-సాయినగర్ షిర్డీ ఉన్నాయి. ఇది కూడా చదవండి – అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు అన్ని సేవలను రద్దు చేసింది.

హౌరా-సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్, హైదరాబాద్-కర్నూల్ సిటీ, గుంటూరు-వికారాబాద్ పాక్షికంగా రద్దయ్యాయి. దానాపూర్-సికింద్రాబాద్, పాట్నా-ఎర్నాకులం రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. SCR ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. రైలు రద్దు/మళ్లింపులు మరియు రైళ్ల పాక్షిక రద్దు గురించిన అప్‌డేట్‌ల కోసం ప్రయాణికులు హెల్ప్ డెస్క్ నంబర్ 040-27786666ను సంప్రదించవచ్చు. 66 MMTS రైళ్లు లేదా సబర్బన్ లోకల్ రైళ్లను కూడా రద్దు చేసింది. నిరసనకారులు కనీసం నాలుగు రైళ్ల బోగీలకు నిప్పు పెట్టారు. రైళ్లలో రవాణా చేస్తున్న వస్తువులను కూడా తగులబెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. దాదాపు ఆరు గంటలకు పైగా స్టేషన్‌లోని ట్రాక్‌లపైనే ఆందోళనకారులు బైఠాయించారు.

  Last Updated: 17 Jun 2022, 05:51 PM IST