Bihar : బీహార్‌లో మైన‌ర్ బాలిక‌ను వివాహం చేసుకున్న 40 ఏళ్ల వ్య‌క్తి

బీహార్‌లోని సివాన్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికను 40 ఏళ్ల వ్య‌క్తి వివాహం చేసుకున్నాడు. నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 08:05 AM IST

బీహార్‌లోని సివాన్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికను 40 ఏళ్ల వ్య‌క్తి వివాహం చేసుకున్నాడు. నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసులు న‌మోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న మైర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. నిందితుడిని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహేంద్ర పాండేగా గుర్తించారు. బాధితురాలి తల్లికి రూ.2 లక్షలు అప్పు ఇప్పించగా, ఆ మొత్తాన్ని తల్లి తిరిగి చెల్లించకపోవడంతో నిందితుడు మైనర్‌తో పెళ్లి చేయాలని కోరిన‌ట్లు స‌మాచారం. దీంతో మైనర్ తల్లి మైర్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే నిందితుడు పాండే.. మైనర్ తమ అంగీకారంతోనే పెళ్లి చేసుకుందని చెబుతున్నాడు. అలాగే, పాండేకు మైనర్‌ను వివాహం చేసుకునే ముందు మరో భార్య ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.