నూతన సంవత్సర వేడుకల కోసం గోవా నుంచి హైదరాబాద్కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సుమారు 183 గ్రాముల కొకైన్, 44 ఎండీఎంఏ (ఎక్స్టాసీ) డ్రగ్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ రూ.26,28,000 ఉంటుందని, వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు జావూద్ అలియాస్ జూద్ హైదరాబాద్ నుండి డ్రగ్స్ సంపాదించాడు. అతను పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, టోలీచౌకి నుండి మహ్మద్ అష్రాఫ్ నుండి సుమారు 181 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వర నుంచి కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేట నుంచి శ్రావణ్ కుమార్, ప్రకాశం జిల్లా నుంచి చరణ్ తేజ్ ఉన్నారు’’ అని సీపీ తెలిపారు.