Site icon HashtagU Telugu

Rythu Bandhu : ఖ‌రీఫ్ సీజ‌న్‌లో రైతు బంధు కోసం ల‌క్ష‌ల్లో ద‌ర‌ఖాస్తులు.. !

Rythubandhu 1 4732 Imresizer

Rythubandhu 1 4732 Imresizer

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకానికి ఖ‌రీఫ్ సీజ‌న్‌లో ద‌ర‌ఖాస్తులు ఎక్కువ‌గా వ‌చ్చాయి. ఈ సీజన్‌లో 3.64 లక్షల మంది రైతులు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రైతుబంధు కోసం ఇప్పటివరకు 58,102 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఖ‌రీఫ్ సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.5000 చొప్పున రూ.7,654.43 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించారు. రైతుబంధు కింద 1.53 కోట్ల ఎకరాలు నమోదయ్యాయని, తాజాగా మరో 1.50 లక్షల ఎకరాలను జాబితాలో చేర్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి పథకం ద్వారా 3.64 లక్షల మంది రైతులకు కొత్తగా ఆర్థిక సాయం అందించారు.

రైతు బంధు అనేది గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి నగదు రుణాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకం. ప్రైవేట్ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులను రక్షించడమే ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.5000, రైతు ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వం ప్రతి సీజన్‌లో ఒక్కో రైతు ఖాతాలో ఎకరానికి రూ.5000 జమ చేస్తుంది. రెండు పంటలు వేస్తే రైతుకు ప్రభుత్వం నుంచి రూ.10వేలు అందుతాయి. ఈ డబ్బుతో విత్తనాలు, రసాయనాలు, ఎరువులు, ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు. ఏటా 68 లక్షల మంది రైతులు ఈ పథకం కింద పెట్టుబడి సాయం పొందుతున్నారు. రాష్ట్రంలో 50 లక్షల 43 వేల 606 ఎకరాలు సాగులో ఉన్నాయి. తెలంగాణలో 55 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.