Kashmir: ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి, 25మందికి గాయాలు

  • Written By:
  • Updated On - December 14, 2023 / 03:42 PM IST

Kashmir: ఉత్తర కాశ్మీర్‌లో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. బందీపొరాలో రాత్రిపూట తరచుగా సంచరిస్తోంది. తాజాగా ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. బందిపోరా జిల్లా చక్ అర్సలాన్ ఖాన్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వన్యప్రాణి సంరక్షణ విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది ఎలుగుబంటిని ట్రాప్ చేసి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలుగుబంటి దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు, కేటీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్