దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు శనివారం భారత్కు చేరుకోనున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్బర్గ్ నుంచి బయలుదేరి గ్వాలియర్కు చేరుకోనున్న ఈ చీతాల కోసం మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో పది క్వారంటైన్ ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. తొలివిడత కింద గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి 8 చీతాలను భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కునో పార్కులో ఉన్న ఈ చీతాలు తరచూ వేటాడుతూ మంచి ఆరోగ్యంతో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.
12 cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు 12 చీతాలు!

Cheetah