11 Electrocuted: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో 11 మంది భక్తులు మృతి

తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Temple Imresizer

Temple Imresizer

తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. తంజావూరు సమీపంలోని కలిమేడు గ్రామంలో, ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు ఉంటుంది. ఇది సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంది.

తిరునారు కరాసు స్వామివారి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా కలిమేడు ఎగువ ఆలయంలో మంగళవారం రాత్రి ఉత్సవాలు నిర్వహించారు. పలు వీధుల్లో రథాన్ని ఊరేగించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కలిమేడు ప్రాంతంలోని పూతలూరు రోడ్డులో రథం నిలిచిపోయింది. హై ఓల్టేజీ వైరు తగిలి కరెంట్ షాక్ కొట్టింది. దాంతో మంటలు చెలరేగాయి. ఇద్దరు చిన్నారులు సహా 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

  Last Updated: 27 Apr 2022, 09:01 AM IST