Site icon HashtagU Telugu

Rain Batters Bihar : బిహార్ లో వర్ష బీభత్సం.. 102 మంది మృతి

102 Dead As Rain Batters Bi

102 Dead As Rain Batters Bi

బిహార్ (Bihar ) రాష్ట్రాన్ని అకాల వర్షాలు (Rain Batters) కబళించాయి. భారీ వర్షాలు, పిడుగులు అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 102 మంది ప్రజలు ప్రాణాలు (102 dead) కోల్పోయినట్లు బిహార్ మంత్రి విజయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఆకస్మిక వర్షపాతం ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు, రైతుల పంటలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపింది.

New Hero Passion Plus: మార్కెట్‌లోకి మ‌రో స‌రికొత్త బైక్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర వివరాలివే!

ఈ వర్షాల వల్ల వ్యవసాయ రంగానికి తీరని నష్టం సంభవించింది. వరి, గోధుమ, పప్పుదినుసులు వంటి పంటలు తడిసి ముద్దవగా, కొన్నిచోట్ల పూర్తిగా నాశనమయ్యాయి. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. వర్షానికి తోడు పిడుగులు కూడా పలు గ్రామాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించాయి. అనేక ఇళ్లకు, గదులకు, విద్యుత్ లైన్లకు కూడా నష్టం జరిగినట్లు సమాచారం.

ఈ విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ టీములను రంగంలోకి దింపి, ఆహారం, నివాసం, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. నష్టం పై రైతులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.