AP News: నంద్యాల జిల్లా సంజామల మండలంలో మంగళవారం కుక్కల దాడిలో సుమారు 100 పొట్టేళ్లు చనిపోయాయి. వీటిని గొర్రెల కాపరి అయిన మురబోయిన శివుడు గుర్తించాడు. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. తెల్లవారుజామున పొలంలో మేస్తున్న సమయంలో కుక్కల గుంపు దాడి చేసిందని శివుడు తెలిపారు. నష్టాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సంజామల పోలీసులు తెలిపారు.
Also Read: TS Assembly Live: అసెంబ్లీ సమావేశాలు షురూ, 42 పేజీలతో శ్వేతపత్రం రిలీజ్!