Site icon HashtagU Telugu

Terror Attack: మోదీ ప్రమాణ స్వీకారం వేళ టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి

Terror Attack

Terror Attack

Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో అత్యంత విషాదం నెల‌కొంది. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో (Terror Attack) యాత్రికులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. SSP మోహిత శర్మ ప్రాథమిక నివేదికలను ఉటంకిస్తూ.. 53 సీట్ల బస్సు శివ ఖోరీ ఆలయం నుండి కత్రాకు వెళుతున్నట్లు తెలిపారు. పోని ప్రాంతంలోని తెరయాత్ గ్రామంలో బస్సుపై దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారని తెలిపారు.

ఉగ్ర‌వాదులు కాల్పులు జరపడంతో బస్సు డ్రైవర్‌ అదుపు తప్పి బస్సు కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. ప్రయాణీకుల గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదు. వారు స్థానికులు కాదు. వీరిని నారాయణ ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. మరణించిన ప్రయాణీకులందరూ ఉత్తరప్రదేశ్ నివాసితులని SSP చెప్పారు. ప్రస్తుతం శివ ఖోరీ తీర్థయాత్రకు భద్రత కల్పించారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో బస్సుపై ఉగ్రవాదుల దాడి తర్వాత భద్రతను పెంచారు.

Also Read: Modi 3.0 : కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు వీరే ..

జమ్మూ కాశ్మీర్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఇందులో 10 మంది మరణించారని, 33 మంది తీవ్రంగా గాయపడ్డారని ఎస్‌ఎస్‌పి రియాసి మోహిత శర్మ తెలిపారు. అదే సమయంలో రియాసిలో ఉగ్రవాదుల దాడి తరువాత రియాసి- అఖ్నూర్ హైవేపై భద్రతను పెంచారు. రియాసీ నుంచి అఖ్నూర్ వైపు వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

పోనీ ప్రాంతంలోని తెరయాత్ గ్రామంలో శివ్ ఖోరీ ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై దాడి జరిగిందని ఎస్‌ఎస్పీ రియాసి మోహిత శర్మ తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు అదనపు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు.