Uttar Pradesh: ఒక విషాద సంఘటనలో శుక్రవారం తెల్లవారుజామున ట్రాక్టర్ ని లారీని ట్రక్కు ఢీకొనడంతో కనీసం పది మంది మరణించారు(10 Killed) మరియు ముగ్గురు గాయపడ్డారు. ట్రాక్టర్ 13 మందికి పైగా కార్మికులతో మిర్జాపూర్ (Mirzapur)-వారణాసి సరిహద్దులోని కచ్చవాన్ మరియు మీర్జామురాద్ మధ్య ప్రయాణిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటన తెల్లవారుజామున 1 గంటలకు జరిగింది.
VIDEO | Uttar Pradesh: Several people died after a truck collided with a tractor in Mirzapur earlier today.
(Full videos available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/CQUGOxpQWY
— Press Trust of India (@PTI_News) October 4, 2024
అర్ధరాత్రి 1 గంటలకు మీర్జామురాద్-కచ్వా సరిహద్దు వద్ద జరిగిన ప్రమాదం గురించి మాకు సమాచారం అందిందని తెలిపారు మీర్జాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభినందన్. లారీ అదుపు తప్పి 13 మందితో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ట్రాక్టర్ భదోహి జిల్లా నుండి బనారస్ వైపు వెళుతోందని ఆయన చెప్పారు. “13 మందిలో, 10 మంది మరణించారు, మరియు గాయపడిన 3 మందిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద బాధితులు 13 మంది భదోహిలో కార్మికులుగా పనిచేసి వారి గ్రామానికి తిరిగి వస్తున్నారు” అన్నారాయన.
VIDEO | Uttar Pradesh: Several people died after a truck collided with a tractor in Mirzapur earlier today.
(Full videos available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/CQUGOxpQWY
— Press Trust of India (@PTI_News) October 4, 2024
ఇదిలా ఉండగా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నందున, ప్రమాదంపై సమగ్ర విచారణ జరుగుతోంది. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎస్పీ మరియు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కచ్చవాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి అని ఒక అధికారి తెలిపారు.
Also Read: Tirupati Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ