10 Dead In Bus Accident: హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ వేగంగా వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

Also Read: Terror Conspiracy: ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు అరెస్ట్

అందిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. బస్సు థానే జిల్లా అంబర్‌నాథ్ నుంచి షిర్డీ వైపు వెళుతోంది. ఇంతలో నాసిక్‌లోని సిన్నార్ తహసీల్‌లోని పఠారే సమీపంలో ఒక ట్రక్కు ఢీకొంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సిన్నార్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

  Last Updated: 13 Jan 2023, 11:07 AM IST