Site icon HashtagU Telugu

Scrap Dealer : చెత్తవ్యాపారి ఇంట్లో రూ.1.25కోట్లు…కంగుతిన్న పోలీసులు…అసలేం జరిగిందంటే..!!

Fact Check

Money

హైదరాబాద్ లో చెత్తవ్యాపారి నుంచి రూ. 1.24కోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇది హవాలా డబ్బుగా పేర్కొన్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మాసబ్ ట్యాంకు పరిధిలో షోయబ్ అనే చెత్త వ్యాపారి నుంచి ఈ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నరారు. షోయబ్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందినవాడు. హైదరాబాద్ లో పాత సామాన్లు సేకరించే వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే గుజరాత్ కు చెందిన భరత్ అనే వ్యక్తి నుంచి షోయబ్ ఈ నగదును తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.పూర్తి సమాచారంతోనే పోలీసులు షోయబ్ నివాసంలో తనిఖీలు చేపట్టి…రూ. 1.24కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version