హైదరాబాద్ లంగర్ హౌజ్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఫస్ట్ లాన్సర్లో నివాసం ఉంటున్న యూసఫ్, తన స్నేహితుడు అస్లాంతో కలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో మెహిదీపట్నం నుండి అత్తాపూర్కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. పివిఎన్ఆర్ పిల్లర్ నంబర్ 60 సమీపంలో రాంగ్ డైరెక్షన్లో వస్తున్న చెత్త వ్యాన్ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యూసఫ్, అస్లాం బైక్ మీద నుండి రోడ్డుపై పడిపోయారు. అస్లామ్ను ఆసుపత్రికి తరలించగా.. యూసుఫ్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.