Site icon HashtagU Telugu

Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగింది? దాని కథేంటి ?

Uttarkashi Tunnel

Uttarkashi Tunnel

Uttarkashi Tunnel Collapse: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూకు ఎట్టకేలకు శుభకార్డు లభించింది. ఈ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 17 రోజుల తర్వాత ఎన్నో ఒడిదుడుకుల మధ్య విజయవంతమైంది. దీంతో కార్మికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే.. ఆ సొరంగంలో ఈ కూలీలు ఎలా ఇరుక్కుపోయారు? ఎక్కడ తప్పు జరిగింది? ఈ సొరంగం కథ ఏమిటి?

ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రసిద్ధ పవిత్ర స్థలాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రిల మధ్య కనెక్టివిటీని అందించే లక్ష్యంతో చార్‌ధామ్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగానే 4.5 కి.మీ మేర ఈ సొరంగం నిర్మాణం చేపట్టారు. దీనిని సిల్క్యారా టన్నెల్ అని కూడా అంటారు. ఇది ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా మరియు దండల్‌గావ్‌లను కలిపే రహదారిపై ఉంది. సిల్క్యారా వైపు నుండి 2.4 కి.మీ మరియు అవతలి వైపు నుండి 1.75 కి.మీ దూరంలో సొరంగం నిర్మించారు. హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ గతంలో ఎన్నో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించింది. కానీ.. అలాంటి ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలు లేవు.

నవంబర్ 12న, సిల్క్యారా వైపు నుండి 205-260 మీటర్ల మధ్య సొరంగం ఒక భాగం కూలిపోయింది. దీంతో 260 మీటర్ల అవతలి వైపు కూలీలు చిక్కుకుపోయారు. బయటపడే మార్గం లేదు. అదృష్టవశాత్తూ వారు చిక్కుకున్న ప్రాంతంలో విద్యుత్ మరియు నీటి సరఫరా ఉంది. అయితే ఈ సొరంగం ఎలా కుప్పకూలిందన్నది ఇంకా వెలుగులోకి రాలేదు, పెళుసుగా ఉండే హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన చోటుచేసుకుందని కొందరు భావిస్తున్నారు. సున్నిత ప్రాంతమని, ఇంత భారీ టన్నెల్ పనిని తట్టుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Digital Loans : డిజిటల్ లోన్స్‌పై కేంద్ర సర్కారు కీలక అప్‌డేట్