Highest Railway Bridge in the World : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Highest Railway Bridge) కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఉంది. తొలిసారిగా దీనిపై నుంచి త్వరలో ట్రైన్ పరుగులు తీయనుంది. రాంచీ – జమ్ము తావి మధ్య నడిచే 18309 నంబర్ SBP JAT ఎక్స్ ప్రెస్ ను నేరుగా శ్రీనగర్ వరకు నడపాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ రైలు వారానికి 4 రోజులు( (సోమ, మంగళ, గురు, శనివారాల్లో) నడుస్తుంది.ఇప్పటికే ఈ వంతెన పై ట్రయల్ రన్ పూర్తి చేశారు. మహేంద్ర బొలెరో కారును రైలు తనిఖీ వాహనంగా మార్చారు. చీనాబ్ వంతెనపై కారు నడుస్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ వంతెన జనవరి 2024 నాటికి లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది.
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అన్ని పరీక్షలు నిర్వహించామని, అవన్నీ విజయవంతం అయినట్లు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ వంతెన అధిక గాలులు, ఉష్ణోగ్రత, భూకంపాలను తట్టుకుంటుందా..? అనే పరీక్షలు నిర్వహించారు. వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, వంతెనపై రైల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: YouTube Village: ఈ గ్రామ విశిష్టత ఏంటో తెలుసా? మరియు అది ఎక్కడ ఉంది?