Muslim Couple: తిరుమల శ్రీవారికి ముస్లిం దంపతుల రూ.1.02 కోట్ల విరాళం

తిరుమల ఆలయానికి ఓ ముస్లిం దంపతులు 1.02 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.

Published By: HashtagU Telugu Desk
Ttd

Ttd

తిరుమల ఆలయానికి ఓ ముస్లిం దంపతులు 1.02 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయ వ్యవహారాలను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అబ్దుల్ ఘనీ, నుబినా బాను మంగళవారం చెక్కును అందించారు. చెన్నైకి చెందిన దంపతులు ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.

బాలాజీ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి అబ్దుల్ ఘనీ అనే వ్యాపారవేత్త విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2020లో, అతను కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆలయ ప్రాంగణంలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడానికి మల్టీ డైమెన్షనల్ ట్రాక్టర్-మౌంటెడ్ స్ప్రేయర్‌ను విరాళంగా ఇచ్చాడు. గతంలో కూరగాయల రవాణా కోసం ఆలయానికి రూ.35 లక్షల రిఫ్రిజిరేటర్ ట్రక్కును అందించారు. ముస్లిం దంపతులు వేంకటేశ్వర స్వామికి కోటిపైగా రూపాయలు విరాళం ఇవ్వడాన్ని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

  Last Updated: 21 Sep 2022, 03:01 PM IST