Site icon HashtagU Telugu

Richest Cricketer : ఈ క్రికెటర్‌కు 225 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది తెలుసా?

Richest Cricketer

Richest Cricketer

Richest Cricketer : మనదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరు ?  అనగానే.. అందరూ సచిన్‌, కోహ్లి, ధోని, రోహిత్‌ శర్మ వైపు చూస్తారు. కానీ సంపదలో వీరిని మించిన రిచెస్ట్ క్రికెటర్ ఒకరు ఉన్నారు.  ఆమె పేరే.. మృదుల జడేజా !! ఆమె ఓ యువరాణి. గుజరాత్‌లోని ప్రముఖ రాజ వంశం నుంచి క్రికెట్ ప్రపంచంలోకి మృదుల జడేజా  అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె గుజరాత్‌లోని సౌరాష్ట్ర టీమ్ కెప్టెన్‌గా ఉన్నారు. సచిన్‌, కోహ్లి, ధోని, రోహిత్‌ శర్మ వంటివారు మ్యాచ్ ఫీజు, యాడ్స్, ఇతర బిజినెస్​‌లతో డబ్బులు సంపాదించారు. కానీ  మృదుల జడేజాది రాజవంశం కావడంతో.. ఆమెకు విలువైన వారసత్వ ఆస్తులు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

  • మృదుల జడేజా  ఆల్‌రౌండర్.
  • ఆమె తండ్రి పేరు మంధాతసిన్హ్‌ జడేజా.
  • తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి తమ చారిత్రాత్మక రంజిత్‌ విలాస్‌ ప్యాలెస్‌లో మృదుల జడేజా నివసిస్తుంటారు.
  • రాజ్‌కోట్‌లో సుమారు 225 ఎకరాల్లో ఉన్న ఓ ఎస్టేట్‌లో ఈ భవనం ఉంది.
  • మృదుల కుటుంబానికి చెందిన ప్యాలెస్‌లో 150కిపైగా గదులు ఉన్నాయి.
  • మృదుల ఇంటి గ్యారేజ్‌లో ఎన్నో కాస్ట్లీ వింటేజీ కార్లు ఉన్నాయి.
  • మృదుల కెరీర్​ను చూస్తే.. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో 46 వన్డేలు, టీ20 ఫార్మాట్లో 36 మ్యాచ్‌లు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌ ఆడారు.
  • మృదుల కుడిచేతి వాటం గల 32 ఏళ్ల బ్యాట్స్ ఉమెన్.. రైటార్మ్‌ మీడియం పేసర్‌ కూడా.
  • గతంలో పురుష, మహిళా క్రికెటర్ల వేతనాలకు మధ్య వ్యత్యాసాలపై పోరాడిన వాళ్లలో మృదుల(Richest Cricketer) కూడా ఉన్నారు.