Longest Bridge : దేశంలోనే పొడవైన రైలు వంతెన పేరు ‘‘పంబన్’’. ఇది 2024 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న పంబన్ ద్వీపం.. అదే రాష్ట్రంలోని మండపం పట్టణాలను అనుసంధానిస్తూ సముద్రం మీదుగా ‘‘పంబన్’’ రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది మన దేశంలోని మొట్టమొదటి హైడ్రాలిక్ రైలు వంతెన. క్రూయిజర్ షిప్ వచ్చినప్పుడు, ఈ వంతెనను పైకి లేపుతారు. రైలు వచ్చినప్పుడు ఈ వంతెన రైల్వే ట్రాక్కి లింక్ అవుతుంది. ఈ వంతెన నిర్మాణ పనులు 2019 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఇటీవల ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో పంబన్ వంతెన నమూనాను ప్రదర్శించారు. పంబన్ వంతెన ఎలా పని చేస్తుందనేది మోడల్ ద్వారా వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.