Employees: ఇక ఆఫీసులో కాసేపు కునుకు తీయొచ్చు!

కొంతమంది ఆఫీసులో కుర్చీలకు అతుక్కుపోయినట్లే కూర్చుంటారు.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 01:06 PM IST

కొంతమంది ఆఫీసులో కుర్చీలకు అతుక్కుపోయినట్లే కూర్చుంటారు. మధ్య మధ్యలో విరామం తీసుకునేందుకు కూడా వెనకడతారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మరి ప్రొడక్టివి పెంచడం ఎలా అనే ప్రశ్నకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ వేక్ ఫిట్ సరికొత్తగా ఆలోచించింది. సోఫాలు, పరుపులు తయారు చేసి ఈ సంస్థ ఈ మధ్యే కోరమంగళ ప్రాంతంలో ఆఫీసును ప్రారంభించింది. ఆఫీసులో పనిచేసి అలసిపోయిన ఉద్యోగుల నుంచి మరింత ప్రొడక్టివిటీని రాబట్టేందుకు న్యాప్ టైం అవర్ ను తీసుకువచ్చింది.
దీనిలో భాగంగా ఉద్యోగులు ప్రతిరోజూ మధ్యాహ్నం అరగంట ఆఫీసులోనే కునుకు తీయవచ్చు. ఇలా చేస్తే పనిఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆందోళన కూడా దూరం అవుతుంది. దీంతో మరింత ఉత్సాహం పనిచేస్తారు. ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని సంస్థ పేర్కొంది.

ఈ సందర్భంగా వేక్ ఫిట్ సహ వ్యపస్థాపకుడైన చైతన్య రామ లింగగౌడ స్పందిస్తూ..నిద్రకు సంబంధించిన వ్యాపారంలో తాము ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నామని..తమ సంస్థ ఆన్ లైన్ ద్వారా వినియోగదారులతో మాట్లాడి నిద్ర సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. వర్క్ బిజీలో పడి…ఉద్యోగులు విశ్రాంతి తీసుకోరని…అలాంటి వారి కోసం మధ్యలో 26 నిమిషాల పాటు నిద్రపోయినట్లయితే…పనితీరు 33శాతం మెరుగుపడుతుందని నాసా అధ్యయనంలో తేలిందని…హార్వర్డ్ అధ్యయనం కూడా ఇదే చెప్పిందన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30మధ్య అధికారికంగా న్యాప్ టైం ఇవ్వాలని నిర్ణయించినట్లు చైతన్య తెలిపారు. ఇందుకుగాను కార్యాలయంలో న్యాప్ ఫ్యాడ్స్ ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.