Site icon HashtagU Telugu

RTC Buses: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాకొద్దు, ప్రభుత్వ టీచర్స్ వినూత్న నిర్ణయం

Teachers

Teachers

ప్రభుత్వం నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయడం కూడా ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమానికి మహిళలందరూ హర్షం వ్యక్తం చేయగా, సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్లు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా నిరాకరించారు.

టిక్కెట్ తీసుకుంటామని, ఆ తర్వాతే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు.  ఎస్కే జెబున్నీసా, పుట్టా మల్లీశ్వరి, రఫియా బేగం, ఎం సునీతాదేవి, ధనలక్ష్మి, కరుణశ్రీ, విజయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

యాజమాన్యాల నుంచి మంచి వేతనం పొందుతున్న మహిళలు టికెట్ తీసుకుని ఆర్టీసీకి కొంత ఆదాయం వచ్చేలా సహకరిస్తే బాగుంటుందన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో ప్రభుత్వం శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేలా చూడాలని కోరారు.

Exit mobile version