Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?

ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు(Anti Sikh Riots 1984), దోపిడీలు, గృహదహనాలు జరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Anti Sikh Riots 1984 Sikh Massacre Congress Sajjan Kumar

Anti Sikh Riots 1984: ఢిల్లీలో సిక్కులపై 1984 సంవత్సరం నవంబరు 1న జరిగిన పాశవిక దాడుల ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు  బుధవారం రోజు దోషిగా తేల్చింది. ఆయనకు ఫిబ్రవరి 18న శిక్షను ఖరారు చేస్తామని ప్రకటించింది. ఇంతకీ ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు ఎందుకు జరిగాయి ? ఆ రోజు అసలేం జరిగింది ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :First Dalit CM : దేశంలోనే తొలి దళిత సీఎం మన ‘సంజీవయ్య’.. జీవిత విశేషాలు

1984 నవంబరు 1న ఢిల్లీలో ఏం జరిగింది ?

  • మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని 1984 అక్టోబరు 31న ఆమె ఇద్దరు బాడీగార్డులు దారుణంగా హత్య చేశారు. వాళ్లిద్దరూ సిక్కు వర్గానికి చెందినవారే.  అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇందిరాగాంధీ సర్కారు సైనిక ఆపరేషన్‌ను నిర్వహించినందుకు ప్రతీకారంగా ఈ హత్యకు పాల్పడ్డారు.
  • ఇందిరా గాంధీ హత్య జరిగిన మరుసటి రోజున (1984 నవంబర్‌ 1న) ఢిల్లీలోని సరస్వతీ విహార్‌ ప్రాంతంలో ఉన్న సిక్కుల నివాసాలపై అల్లరి మూకలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు.
  • ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు(Anti Sikh Riots 1984), దోపిడీలు, గృహదహనాలు జరిగాయి.
  • సరస్వతి విహార్‌ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను ఓ అల్లరిమూక హత్య చేసింది. ఆ అల్లరిమూక గుంపునకు మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ నాయకత్వం వహించాడని తాజాగా ఢిల్లీ కోర్టు తేల్చింది. ఇందుకు తగిన సాక్ష్యాలు కూడా లభించాయని వెల్లడించింది.
  • ఈ కేసులో 2021 డిసెంబర్‌ 16న సజ్జన్‌కుమార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. మూడేళ్ల పాటు  విచారణ జరిపిన కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది.

Also Read :GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?

  • ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన సమయంలో సజ్జన్ కుమార్ ఒక బేకరీని నడుపుకునేవారు. ఆయన ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీకి సన్నిహితంగా ఉండేవారు.
  • సజ్జన్ కుమార్ తొలుత  ఢిల్లీలో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.  ఆయన 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • 1991‌లోనూ సజ్జన్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు.
  • 2004 సార్వత్రిక ఎన్నికల్లో సజ్జన్ కుమార్  అత్యధికంగా 8,55,543 ఓట్లతో మరోసారి ఎంపీ అయ్యారు. అప్పట్లో దేశంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీ ఆయనే.
  • ఔటర్ ఢిల్లీ లోక్‌సభ స్థానాన్ని సజ్జన్ కుమార్ తన రాజకీయ కంచుకోటగా మార్చుకున్నారు.
  • 2005లో అర్బన్ డెవలప్‌మెంట్ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా సజ్జన్ వ్యవహరించారు. లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఏరియా స్కీంలో సభ్యుడిగా సేవలు అందించారు.
  • 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా ప్రకటించబడిన తర్వాత, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేశారు.
  • 1984లో ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌కు 2018లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు.
  • దీంతో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.
  Last Updated: 13 Feb 2025, 09:31 AM IST