Monsoon Tours: చూడాల్సిందే తరించాల్సిందే, కర్ణాటకలో చూడాల్సిన ప్రాంతాలివే!

  • Written By:
  • Updated On - August 21, 2023 / 01:44 PM IST

తరచిచూడాలే కానీ కర్ణాటకలో సైతం ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయి. ఎత్తైన జలపాతాలు, తోటలు, సుందరమైన ప్రదేశాలున్నాయి. చిక్‌ మంగుళూరు, కూర్గ్, హంపి లాంటి హిల్ స్టేషన్స్ పర్యాటలకు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒకసారి కర్ణాటకకు వెళ్తే జీవితానికి సరిపడే అనుభూతులు, గొప్ప అనుభవాలను సొంతం చేసుకోవచ్చు.

కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక

చిక్‌మంగళూరు దీనిని అధికారికంగా కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ ముల్లయనగిరి పర్వతాల దిగువన ఉంటుంది. ప్రశాంతమైన స్వభావం, పచ్చని అడవులు, యాగాచి నదికి ప్రసిద్ధి. కెమ్మగుండి, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, ముల్లాయనగిరి, హెబ్బే ఫాల్స్, బాబా బుడంగిరి సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు. స‌ముద్ర‌మ‌ట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం. బెంగుళూరు నుంచి 242 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇక్క‌డ హిరేకొలాలే స‌ర‌స్సు, మాణిక్య‌ధార ఫాల్స్‌, అయ్య‌న‌కెరే స‌ర‌స్సు, ములియంగిరి వంటి ప్ర‌దేశాల‌ను చూడొచ్చు.

హస్తకళను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు

హంపి కర్నాటకలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. వర్షాకాలం ప్రారంభంతో దీని అందం మ‌రింత పెరుగుతుంది. ఇక్కడ పొడి ప్రాంతం పచ్చని పచ్చిక బయళ్ళుగా మారుతుంది. హంపిలోని సహజ దృశ్యాలతో చుట్టుముట్టబడిన అనేక దేవాలయాలు వర్షం రాక‌తో మరింత అందంగా కనిపిస్తాయి. హంపి కర్ణాటకలోని లోతైన లోయలు మరియు కొండలలో దాగి ఉంది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం శిథిలమైన దేవాలయ శిధిలాలు, ఆనవాళ్లు ఉంటాయి. ఇది కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. మీకు చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ప్రదేశం కచ్చితంగా సందర్శించాలి. ఇక్కడి కళాకారుల హస్తకళను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. బెంగుళూరు నుంచి హంపి 340 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

ప్రసిద్ధ కాఫీ తోటలు

ప్రకృతి అందాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘కూర్గ్’ పేరు తప్పకుండా విని ఉంటారు. ఇక్క‌డి తోటల అందం వర్షాకాలంలో మ‌రింత అందంగా మారుతుంది. ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ దృశ్యాలు ప‌ర్యాట‌కుల హృదయాన్ని తాకుతాయి. దీన్ని భార‌త స్కాట్‌లాండ్ అని కూడా అంటారు. కొడ‌గు అని కూడా పిలుస్తారు. మడికేరి పట్టణం, హై పాయింట్ రాజా సీటు మరియు అబ్బే ఫాల్ వీక్షణలు కూర్గ్‌ను స్వర్గధామం కంటే తక్కువ కాకుండా చేస్తాయి. కర్ణాటకలోని ఈ హిల్ స్టేషన్‌లో చాలా ఆఫర్లు ఉన్నాయి. ప్రసిద్ధ కాఫీ తోటలు ఇక్కడి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అద్భుతమైన చరిత్ర, సహజ సౌందర్యం, రుచికరమైన వంటకాలను ఇక్క‌డ ఆస్వాదించవచ్చు. బెంగుళూరు నుంచి ఈ ప్రాంతం 265 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

కొండలతో కూడిన హాట్‌స్పాట్‌

సకలేష్‌పూర్ మల్నాడులోని పశ్చిమ కనుమల దిగువన ఉన్న ప్రదేశం. ఈ నగరం ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌ను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ టీ, కాఫీ, ఏలకులు మరియు మిరియాలు తోటలతో కప్పబడిన పచ్చని కొండల గుండా ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఎత్తైన కొండలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Also Read: Indira Gandhi: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఇందిరాగాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌