తమిళనాడులో అనూహ్య వాతావరణ మార్పులకు కారణం ఏమిటి? తరచూ అక్కడ వర్షాలు ఎక్కువగా ఎందుకు పడతాయి? వాతావరణ పరిణామాలు భయకరంగా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలు తరచూ మెదలు తుంటాయి. దానికి గల కారణాలను వాతావరణ శాస్త్రవేత్తలు అన్వేషించారు. వాళ్లు చెబుతున్న దాని ప్రకారం..సముద్రంపై ఉన్న ఉష్ణోగ్రతలకు, భూమిపై ఉండే వేడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిందూ మహాసముద్రం అనూహ్యంగా వేడెక్కుతోంది, సముద్ర-ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే పెరిగిపోతున్నాయి. 26.5 డిగ్రీల సెల్సియస్ అనేది థ్రెషోల్డ్ విలువ, కానీ ఇప్పుడు 29 డిగ్రీలకు దగ్గరగా ఉంది.
Also Read : Chennai Rains: తమిళనాడులో రెడ్ అలెర్ట్
స్కైమెట్ వెదర్ ప్రెసిడెంట్-మెటియోరాలజీ మరియు క్లైమేట్ చేంజ్ GP శర్మ మాట్లాడుతూ, “సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదల ప్రభావం భూమి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఎక్కువ. ఇది ఎక్కువ కాలం లోతట్టు ప్రాంతాలకు ప్రయాణిస్తుంది.
ఫలితంగా సముద్ర మట్టం 10 నుండి 15 శాతం పెరిగింది” అని IMD వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర అన్నారు.
పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ ప్రకారం “తూర్పు తీరం వాతావరణ మార్పు కు ముఖ్యమైన అంశం ఏమిటంటే తీవ్రమైన వాతావరణం మరియు వాతావరణ మార్పులు అతిగా వ్యాప్తి చెందడం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సముద్ర మట్టం కూడా పెరుగుతోంది. అందువల్ల, తుఫాను ఉప్పెన మరియు వర్షాల కారణంగా వరద స్థాయి ప్రతి ఏడాది పెరుగుతోంది, ”అని రాక్సీ చెప్పారు.