కర్ణాటకలో పోలింగ్ సందడి నెలకొంది. ఓట్లు వేసేందుకు జనం పోటెత్తుతున్నారు. ఉదయం 9 గంటల వరకు 8 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటలలోపే ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పలువురు ప్రముఖులు(vip vote) కూడా ఉన్నారు. ఈ లిస్టులో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి దంపతులు తదితరులు ఉన్నారు. ఇదే రోజు పెళ్లి ఉన్న కొందరు ఇద్దరు వధువులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు(vip vote) వేసి వెళ్లారు.
ఉడుపి జిల్లాలోని కాపు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ 187వ నంబర్ బూత్ లో, చిక్క మంగళూరు జిల్లాలోని ముడిగెరె అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న మాకోనా హళ్లిలోని 165వ నంబర్ పోలింగ్ బూత్ లో ఇద్దరు పెళ్లి కూతుర్లు ఓటు వేశారు.
బెంగళూరులోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి దంపతులు
ALSO READ : Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో 6 రాష్ట్రాల ఓటర్లు..!
హవేరీ జిల్లాలోని శిగ్గావోన్ లో ఉన్న గవర్నమెంట్ హయ్యర్ ప్రైమరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేస్తున్న సీఎం బస్వరాజ్ బొమ్మై
శివమొగ్గలోని పోలింగ్ బూత్ లో ఓటు వేస్తున్న మాజీ సీఎం యడియూరప్ప