Rush@Mall: అర్ధరాత్రి షాపింగ్ మాల్ లోకి పోటెత్తిన జనం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మామూలుగా షాపింగ్ మాల్స్ లో లేదంటే బంగారు షాపులలో, లేదంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే షాపులలో డిస్కౌంట్ లు పెడితే చాలు జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - July 11, 2022 / 11:00 PM IST

మామూలుగా షాపింగ్ మాల్స్ లో, లేదంటే బంగారు షాపులలో, లేదంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే షాపులలో డిస్కౌంట్ లు పెడితే చాలు జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాంటిది షాపింగ్ మాల్ లో 10%, 20% డిస్కౌంట్ అంటే ఇక ఆ షాపింగ్ మాల్ మొత్తం కిటకిటలాడుతూ ఉంటుంది. అలా కాకుండా షాపింగ్ మాల్ లో ఏకంగా 50% డిస్కౌంట్ అంటే ఆ షాపింగ్ మాల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా అందులో జనాలు ఏ రేంజ్ లో ఉంటారో మనందరికీ తెలిసిందే.

అలా తాజాగా ఒక షాపింగ్ మాల్ లో 50% డిస్కౌంట్ పెట్టడంతో షాపింగ్ మాల్ మొత్తం జనాలతో కిరిసిపోయింది. మరి ఆ షాపింగ్ మాల్ ఎక్కడ ఉంది? ఎందుకు 50% డిస్కౌంట్ పెట్టారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం.. పూర్తి వివరాలు పెడితే.. కేరళలోని ఓ షాపింగ్ మాల్ అర్ధరాత్రి వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. ప్రజలు షాపింగ్ చేయడం కోసం తండోపతండాలుగా తరలి వెళ్లారు. అయితే అందుకు గల కారణం ఆ షాపింగ్ మాల్ యాజమాన్యం భారీ డిస్కౌంట్ ప్రకటించడమే.

కేరళ లోని లులు మాల్‌ యజమాన్యం తమ మాల్‌లోని ప్రతి వస్తువు పైనా 50% డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ నెల 6వ తేదీ రాత్రి 11:59 గంటల నుంచి 7వ తేదీ తెల్లవారుజాము వరకే వర్తిస్తుందని తెలిపింది. దీంతో ప్రజలందరూ ఆ సమయంలో మాల్‌కు ఎగబడ్డారు. అయితే ఆ షాపింగ్ మాల్ లోకి వినియోగదారులు అక్కడ పని చేసే స్టాఫ్ వారిని అదుపు చేయలేక నానా తంటాలు పడ్డార అంతే కాకుండా కనీసం నిలబడేందుకు చోటు కూడా లేనంతగా మాల్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది అంటే వినియోగదారులు ఏ రేంజ్ లో వచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే మెట్లపై కూడా ఇసుక వేస్తే కిండికీ రాలనంత మంది జనం వచ్చారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. మిడ్‌నైట్ సేల్ మరిన్ని సార్లు ప్రకటిస్తామని షాపింగ్ మాల్ యజమాన్యం ప్రకటించింది.