Kerala: నిశ్చితార్థం సందర్భంగా చాలా రకాల వెరైటీలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నామధ్య వధువు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత పెళ్లి సందర్భంగానూ బుల్లెట్ బండి సాంగ్తో తెలుగమ్మాయి పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం కావడంతో ఏం జరిగినా క్షణాల్లో వైరల్అయిపోతోంది. ఈ కోవలోనే కేరళలో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. ఓ పెళ్లి కూతురు వరుడిని వెరైటీగా లారీలో కళ్యాణ మండపానికి తీసుకెళ్లింది.
కేరళ రాష్ట్రం త్రిసూర్లో ఈ ఘటన జరిగింది. నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడిని యువతి.. స్వయంగా లారీ తోలుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. ఈ ఘటనతో నిశ్చితార్థం చూడటానికి వచ్చిన గెస్టులంతా ఆశ్యర్యపోయారు. జిల్లాలోని మానలూరు చెందిన దలీషా అనే యువతికి చిన్నప్పుటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కాస్త ప్రత్యేకంగా ఆలోచించిన దలీషా.. కాబోయే భర్తను లారీలో తీసుకెళ్లింది.
తండ్రి డేవిస్ కూడా లారీ డ్రైవర్ కావడంతో తన ఇష్టాన్ని మరింత పెంచుకుంది. చాలా సార్లు తండ్రి లేకుండానే లారీ నడిపేది. ఈక్రమంలో కొచ్చి నుంచి పెట్రోలును తీసుకొచ్చి మలప్పురం బంకుకు సరఫరా చేసేది. ఆ సమయంలో ఆమె ట్యాంకర్ నడుపుతున్న వీడియోలను తీశారు. ఆ వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలు పరిశీలించిన ఓ గల్ఫ్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది.
గల్ఫ్లో ట్యాంకర్ డ్రైవర్గా చేరిన సమయంలో జిల్లాలోని కంజీరా పల్లికి చెందని డ్రైవర్ హన్సన్తో యువతికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా చిగురించింది. ఈ నేపథ్యంలోనే ఇరుకుటుంబాలకు విషయం చెప్పారు. దీంతో ఇద్దరి కుటుంబాల్లోనూ వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
దలీషా కొత్త ఆలోచన..
తర్వాత సెయింట్ ఆంథోని చర్చిలో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నిశ్చితార్థం అందరూ చేసుకొనేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండాలని దలీషా అనుకుంది. అంతే.. ఇక కొత్త ఆలోచన చేసింది. వరుడు హన్సన్ను కల్యాణ మండపానికి లారీలో తీసుకెళ్లింది. ఈ సమయంలో స్వయంగా లారీ నడుపుకుంటూ ఆమె హన్సన్ను తీసుకెళ్లడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.