Vande Bharat Express: వందే భారత్ రైలు (Vande Bharat Express)పై రాళ్లదాడి ఘటనలు ఆగడం లేదు. శనివారం (జూలై 1) రోజు ధార్వాడ్-బెంగళూరు ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకున్నారు కొందరు దుండగులు. ఈ రాళ్లదాడిలో రైలు కిటికీ అద్దాలకు స్వల్ప నష్టం జరిగింది. దేవంగిరి రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్లదాడి ఘటన చోటుచేసుకుంది. ఈ రైలును ప్రధాని మోదీ ఇటీవల జెండా ఊపి ప్రారంభించారు. రైల్వేశాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య దేవంగిరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరి కొంతదూరం చేరుకోగానే అదే సమయంలో రైలుపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం లేదని నైరుతి రైల్వే అధికారి తెలిపారు. రైలు నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకుంద తెలిపారు.
అద్దాలు పగిలిపోయాయి
రైలు ఛైర్కార్ కంపార్ట్మెంట్ (సి4 కోచ్) కిటికీ బయటి భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు రైల్వే అధికారిని ఉటంకిస్తూ డెక్కన్ హెరాల్డ్ పేర్కొంది. విండో లోపలి భాగం పూర్తిగా సురక్షితంగా ఉందన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) దర్యాప్తు ప్రారంభించిందని కూడా ఆయన చెప్పారు. రైల్వే అధికారులు నష్టం, మరమ్మతు ఖర్చులను అంచనా వేశారు. రైలు ప్రాథమిక నిర్వహణ KSR బెంగళూరు రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఆర్పీఎఫ్ రైల్వే చట్టంలోని సెక్షన్ 153 (రైల్వే ఆస్తులను స్వచ్ఛందంగా ధ్వంసం చేయడం) కింద కేసు నమోదు చేసింది. దీని కింద ఐదేళ్ల వరకు శిక్ష విధించే నిబంధన ఉంది.
Also Read: Telangana Congress: ఐక్యత ఒట్టిమాటే..! కోమటిరెడ్డి ట్వీట్ చేసిన పోస్టర్లో రేవంత్ ఫొటో మిస్..
ఇటీవల ప్రధాని మోదీ రైలును ప్రారంభించారు
జూన్ 28న బెంగళూరు-ధార్వాడ్ మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కర్నాటకలో వందే భారత్ ఎక్స్ప్రెస్పై మూడోసారి రాళ్లదాడి జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్పై కూడా రాళ్లు రువ్వడంతో రైలులోని రెండు చైర్కార్ కోచ్లలోని ఆరు కిటికీలు దెబ్బతిన్నాయి.