Bharath jodo yatra : భారత్ జోడో యాత్రలో సోనియాగాంధీ..తల్లి బూట్లకు లేస్ లు కట్టిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కలిసి యాత్రలో పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - October 6, 2022 / 12:11 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కలిసి యాత్రలో పాల్గొన్నారు. గురువారం కర్నాటకలోని మాండ్యాలో రాహుల్ గాంధీ యాత్ర మొదలైంది. ఇక్కడి నుంచే సోనియా గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రాహల్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ బూట్లకు లేస్ లు కట్టాడు. ఈ ఫొటో ను కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ జోడో యాత్ర ఇవాళ పాండవురు నుంచి నాగమంగళ తాలుకా వరకు కొనసాగనుంది.
కాగా చాలా కాలం తర్వాత సోనియా గాంధీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఆమె గత ఎన్నికల్లో ప్రచారానికి కూడా వెళ్లలేదు.