Heavy Rains : త‌మిళ‌నాడులో అకాల వ‌ర్షాలు.. నాగ‌పట్నంలో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు

తమిళనాడులోని నాగపట్నంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు

Published By: HashtagU Telugu Desk
Rains Students

Rains Students

తమిళనాడులోని నాగపట్నంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించాల్సి వచ్చింది. మరోవైపు తిరువారూరు జిల్లాలోని పాఠశాలలకు కూడా ఈ రోజు (గురువారం) సెలవు ప్రకటించారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని కారైకాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. గురువారం తెల్లవారుజామున “నైరుతి బోబ్‌పై అల్పపీడనం 2330 IST వద్ద బట్టికలోవా (శ్రీలంక)కి ఈశాన్యంగా 60 కిమీ, కారైకాల్ (భారతదేశం)కి ఆగ్నేయంగా 400 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఫిబ్రవరి 02 తెల్లవారుజామున పశ్చిమ-నైరుతి దిశగా కదిలి, శ్రీలంక తీరాన్ని బట్టికలోవా – ట్రింకోమలీ మధ్య దాటే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఫిబ్రవరి 02న దక్షిణ తమిళనాడులో చాలా చోట్ల, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి & కారైకల్‌లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది

  Last Updated: 02 Feb 2023, 08:17 AM IST