బెంగళూరు: ఇటీవల మరణించిన కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు ‘కర్ణాటక రత్న’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న 10వ వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. కన్నడ సినీ ప్రముఖుడు డాక్టర్ రాజ్కుమార్ ఐదుగురు పిల్లల్లో చిన్నవాడైన పునీత్ 46 సంవత్సరాల వయస్సులోనే గుండెపోటుతో మరణించాడు.
ಕನ್ನಡನಾಡಿನ ಜನಪ್ರಿಯ ಕಲಾವಿದ ದಿವಂಗತ ಶ್ರೀ ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರಿಗೆ ಮರಣೋತ್ತರ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಿ ಘೋಷಣೆ ಮಾಡಲಾಯಿತು. #KarnatakaRatna pic.twitter.com/CkTjaIn5Ax
— Basavaraj S Bommai (@BSBommai) November 16, 2021
అందరితో చర్చించిన తరువాత పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు అందించాలని నిర్ణయించుకున్నానని సీఎం బొమ్మై తెలిపారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్సిసి) శాండల్వుడ్ సినీ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలతో కలిసి నిర్వహించిన దివంగత పునీత్ రాజ్కుమార్కు నివాళులు అర్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి హాజరైయ్యారు. జాతీయ స్థాయి అవార్డులతో ఆయనను సత్కరించడం గురించి చాలా ఇతర సూచనలు ఉన్నాయి, మా ప్రభుత్వం దీనిపై ఓపెన్ మైండ్తో ఉందని..మరియు రాబోయే మంత్రివర్గంలో ఆ నిర్ణయాలు తీసుకోబడతాయి అని ఆయన చెప్పారు. పునీత్ మరణానంతరం ‘పద్మశ్రీ’ అవార్డు ఇవ్వాలని కోరుతూ చాలా డిమాండ్ లు వచ్చాయని సీఎం అన్నారు.
ಕರ್ನಾಟಕ ಚಲನಚಿತ್ರ ವಾಣಿಜ್ಯ ಮಂಡಳಿ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಇಂದು ಆಯೋಜಿಸಿದ್ದ "ಪುನೀತ ನಮನ" ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ, ಪುಷ್ಪ ನಮನಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲಾಯಿತು.
ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಿ.ಎಸ್.ಯಡಿಯೂರಪ್ಪ, ಹಲವು ಮುಖಂಡರು, ಕಲಾವಿದರು, ಚಿತ್ರರಂಗದ ಗಣ್ಯರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು.#PuneethRajkumar pic.twitter.com/lxkYhj1bQN
— Basavaraj S Bommai (@BSBommai) November 16, 2021
మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, సిద్ధరామయ్య, బొమ్మై మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, రాజకీయ నేతలు, కన్నడ, దక్షిణాది సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కర్ణాటక రత్న ప్రకటనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Also Read: విమాన ప్రయాణ ఎత్తును పెంచుతోన్న వాతావరణ మార్పులు
2009లో సామాజిక సేవకు గానూ డా. వీరేంద్ర హెగ్గడేకు కర్ణాటక రత్న చివరిసారిగా లభించింది. 1992లో కర్నాటక రత్న అవార్డును పొందిన మొదటి వ్యక్తులలో పునీత్ దివంగత తండ్రి రాజ్కుమార్ కూడా ఉన్నారు. ఇతర అవార్డు గ్రహీతలు S నిజలింగప్ప (రాజకీయం), CNR రావు (సైన్స్), డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి (వైద్యం), భీమ్సేన్ జోషి (సంగీతం), శివకుమార స్వామిజీ (సామాజిక సేవ), మరియు Dr J జవరేగౌడ (విద్య & సాహిత్యం). పునీత్ రాజ్కుమార్ను అమరత్వంగా మార్చడానికి చాలా సూచనలు వచ్చాయని బొమ్మై అన్నారు. ప్రభుత్వ కోరిక కూడా ఒకటి ఉందని…పునీత్ అంతిమ విశ్రాంతి స్థలం అతని తల్లిదండ్రులు-డాక్టర్ రాజ్కుమార్ మరియు పార్వతమ్మ రాజ్కుమార్ల మాదిరిగానే అభివృద్ధి చేయబడుతుందని వెల్లడించారు. అక్టోబర్ 31న కంఠీరవ స్టూడియోలోని డాక్టర్ రాజ్కుమార్ పుణ్యభూమిలో అతని తండ్రి మరియు తల్లి పక్కన పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: శ్రీవారి సేవల విషయంలో “సుప్రీం” కీలక వ్యాఖ్యలు
పునీత్కు కర్నాటక రత్న ప్రదానం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సిద్ధరామయ్య, ఆయనకు మరణానంతరం ‘పద్మశ్రీ’ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి మరియు ఆయన మంత్రివర్గాన్ని కోరారు. పునీత్ స్మారకార్థం యువ నటీనటులకు శిక్షణ ఇచ్చే సంస్థను ఏర్పాటు చేయాలని శివకుమార్ కోరారు. అభిమానులచే ‘అప్పు’ మరియు ‘పవర్ స్టార్’ అని పిలుచుకునే పునీత్, కేవలం ఆరు నెలల వయస్సులో తెరపైకి అడుగుపెట్టడు. ‘బెట్టాడ హూవు’ చిత్రానికి బాలనటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. . అతను 2002లో ప్రధాన నటుడిగా మళ్లీ తెరపైకి వచ్చాడు మరియు కొన్ని పెద్ద హిట్లను అందించి 29 చిత్రాలలో నటించాడు.